Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

నాయకత్వం, సంస్కరణలు, పరివర్తనను ప్రతిబింబించే కథనాన్ని పంచుకున్న ప్రధానమంత్రి


శ్రీ అమితాబ్ కాంత్ రాసిన వ్యాసాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు. ఈ కథనంలో ప్రధానమంత్రితో పనిచేసిన అనుభవాలను, పెద్ద కలలు కనడానికున్న ప్రాధాన్యాన్ని, మార్పును తీసుకురావడంలో సంస్కరణల పాత్ర గురించి శ్రీ అమితాబ్ కాంత్ వివరించారు. ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, కనీస మౌలిక వసతుల లాంటి రంగాల్లో ఫలితాలను మెరుగుపరచడంలో ఆకాంక్షాత్మక జిల్లాల కార్యక్రమం ప్రభావాన్ని ఈ కథనం తెలియజేస్తోంది. ప్రజలకు, వ్యాపారాలకు సులభమైన, సరళమైన, మరింత సమర్థమైన భారత్‌ను అందించేలా విస్తృతమైన సంస్కరణలు ఎలా దోహదపడ్డాయో వివరిస్తోంది.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి చేసిన పోస్టు:

ప్రధానమంత్రితో కలసి పనిచేసిన అనుభవాన్ని, ఆయన పనితీరును, పెద్ద కలలు కనడానికున్న ప్రాధాన్యాన్ని, సంస్కరణలు మార్పును ఎలా తీసుకొస్తున్నాయో వివరిస్తూ శ్రీ అమితాబ్ కాంత్ రాసిన వ్యాసమిది.

ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, కనీస మౌలిక వసతుల రంగాలు మెరుగయ్యేలా ఆకాంక్షాత్మక జిల్లా కార్యక్రమం ఎలా దోహదపడిందో ఈ కథనంలో వివరించారు. అలాగే ప్రజలకు, వ్యాపారాలకు మరింత సులభతరంగా, వేగంగా, సమర్థంగా ఉండే భారత్‌ను తీర్చిదిద్దిన సంస్కరణల గురించి కూడా వివరించారు.

https://indianexpress.com/article/opinion/columns/amitabh-kant-narendra-modi-leadership-10882779/lite/

 

***