పిఎంఇండియా
పార్లమెంటులో జన్ విశ్వాస్ (నిబంధనల సవరణ) బిల్లు-2026 ఆమోదం పొందటంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. పౌరులను సాధికారత వైపు నడిపించటంలో, విశ్వాసంతో సాగే పాలనా వ్యవస్థను బలోపేతం చేయటంలో ఈ బిల్లు కీలక ముందడుగని పేర్కొన్నారు. పాతబడిన చట్టాలు, నిబంధనల తొలగింపుతో పాటు పలు ఉల్లంఘనలను నేరరహితం చేయటం ద్వారా కేసులను త్వరగా పరిష్కరించేలా చేయటం, కోర్టులో కేసుల భారాన్ని తగ్గించటమే ఈ బిల్లు లక్ష్యం.
ఈ బిల్లు రూపకల్పనలో అనుసరించిన సంప్రదింపుల విధానాన్ని ప్రధానమంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు. బిల్లు ముసాయిదా ప్రక్రియలో విలువైన సూచనలు అందించిన వారిని, పార్లమెంటులో బిల్లుకు మద్దతు తెలిపిన వారందరినీ అభినందించారు.
సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు.
” ‘జీవన సౌలభ్యం’, ‘సులభతర వ్యాపారానికి‘ భారీ ఊతం..
పార్లమెంటులో జన్ విశ్వాస్ (నిబంధనల సవరణ) బిల్లు-2026 ఆమోదం పొందటం హర్షించదగిన విషయం. పౌరులను సాధికారత వైపు నడిపించే, విశ్వాసంతో సాగే పాలనా వ్యవస్థను ఈ బిల్లు బలోపేతం చేస్తుంది. కాలం చెల్లిన నిబంధనలను తొలగించటం, చిన్నపాటి ఉల్లంఘనలను నేరరహితం చేయటం ద్వారా వేగవంతమైన కేసుల పరిష్కారంతో పాటు కోర్టులో కేసుల భారాన్ని తగ్గిస్తుంది.
ఈ బిల్లును రూపొందించటంలో అనుసరించిన సంప్రదింపుల విధానం అభినందనీయం.
ఈ బిల్లు రూపకల్పనలో అమూల్యమైన సూచనలను అందించిన వారికి, పార్లమెంటులో మద్దతు తెలిపిన వారికి అభినందనలు“.
A big boost to ‘Ease of Living’ and ‘Ease of Doing Business’…
— Narendra Modi (@narendramodi) April 2, 2026
It’s a matter of immense delight that Parliament has passed the Jan Vishwas (Amendment of Provisions) Bill 2026. This Bill strengthens a trust-based framework that empowers our citizens. It marks the end of rules and…