పిఎంఇండియా
గౌరవనీయ లోక్ సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా గారు, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ శ్రీ హరివంశ్ గారు, గౌరవనీయ పార్లమెంటు సభ్యులు, సీనియర్ ప్రజాప్రతినిధులు, విశిష్ట అతిథులు, ఇతర ప్రముఖులందరూ, ప్రియమైన నా దేశప్రజలారా!
ప్రతి దేశ అభివృద్ధి ప్రయాణంలో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయే క్షణాలు ఉంటాయి. కొన్ని తేదీలు చరిత్ర నుదుటిపై చెరగని ముద్ర వేస్తాయి. నేడు 29 మే, 2023 అటువంటి శుభ సందర్భం. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశం ‘అమృత్ మహోత్సవ్‘ను నిర్వహిస్తోంది. భారత ప్రజలు తమ ప్రజాస్వామ్యాన్ని ఈ ‘అమృత్ మహోత్సవ్‘లో ఈ నూతన పార్లమెంటు భవనాన్ని బహుమతిగా ఇచ్చారు. ఉదయం పార్లమెంట్ హౌస్ ఆవరణలో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. భారత ప్రజాస్వామ్య ఈ సువర్ణ ఘట్టానికి నేను దేశ ప్రజలందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను.
మిత్రులారా,
ఇది కేవలం భవనం మాత్రమే కాదు. ఇది 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలు, కలలకు ప్రతిబింబం. భారతదేశ దృఢ సంకల్ప సందేశాన్ని ప్రపంచానికి అందించే మన ప్రజాస్వామ్య దేవాలయం ఇది. ఈ నూతన పార్లమెంటు భవనం ప్రణాళికలను వాస్తవికతతో, విధానాలను అమలుతో, సంకల్ప శక్తిని కార్యాచరణ శక్తితో, సంకల్పంతో విజయంతో అనుసంధానించే ఒక ముఖ్యమైన అనుసంధానంగా నిరూపించబడుతుంది. ఈ నూతన భవనం మన స్వాతంత్ర్య సమరయోధుల కలలను సాకారం చేయడానికి ఒక మాధ్యమంగా పనిచేస్తుంది. ఈ నూతన భవనం ‘ఆత్మనిర్భర్ భారత్‘ ఆవిర్భావానికి సాక్ష్యంగా నిలవనుంది. ఈ నూతన భవనం అభివృద్ధి చెందిన భారతదేశ ఆకాంక్షల సాధనకు సాక్ష్యంగా నిలుస్తుంది. ఈ నూతన భవనం ఆధునిక, పురాతన సహజీవనానికి ఆదర్శవంతమైన ప్రాతినిధ్యం.
మిత్రులారా,
నూతన మార్గాల్లో నడవడం ద్వారానే నూతన ఒరవడి ఏర్పడుతుంది. నేడు నవభారతం నూతన లక్ష్యాలను నిర్దేశించుకుంటూ నూతన దారులు తొక్కుతోంది.. నూతన ఉత్సాహం, నూతన అభిరుచితో.. కొత్త ప్రయాణం, కొత్త ఆలోచన. దిశ కొత్తది, దృష్టి కొత్తది. తీర్మానం కొత్తది, నమ్మకం కొత్తది. సంకల్పం కొత్తగా ఉంది. ఆత్మవిశ్వాసం కొత్తగా ఉంటుంది. ఈ రోజు మరోసారి ప్రపంచం మొత్తం భారతదేశాన్ని, భారతదేశ దృఢ సంకల్పాన్ని, భారత ప్రజల పరాక్రమాన్ని, భారత ప్రజల స్ఫూర్తిని గౌరవంతో, ఆశతో చూస్తోంది. భారతదేశం పురోగమిస్తే ప్రపంచం పురోగమిస్తుంది. ఈ నూతన పార్లమెంటు భవనం భారతదేశ అభివృద్ధికి నాంది పలకడమే కాకుండా ప్రపంచ పురోగతికి పిలుపునిస్తుంది.
మిత్రులారా,
ఈ చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకుని కొద్దిసేపటి క్రితం పార్లమెంట్ నూతన భవనంలో పవిత్ర సెంగోల్ ను కూడా ప్రతిష్టించారు. గొప్ప చోళ సామ్రాజ్యంలో, సెంగోల్ కర్తవ్యానికి, సేవా మార్గానికి, జాతీయవాద మార్గానికి చిహ్నంగా పరిగణించబడింది.. రాజాజీ, అధీనం ఋషుల మార్గదర్శకత్వంలో ఈ సెంగోలు అధికార మార్పిడికి చిహ్నంగా మారింది. ముఖ్యంగా తమిళనాడు నుంచి వచ్చిన అధీనం సాధువులు ఈ ఉదయం పార్లమెంట్ హౌస్ కు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించారు. వారికి మళ్లీ గౌరవపూర్వకంగా నమస్కరిస్తున్నాను. వారి మార్గదర్శకత్వంలో లోక్ సభలో ఈ పవిత్ర సెంగోల్ ను ఏర్పాటు చేశారు. తాజాగా దీని చరిత్రకు సంబంధించిన చాలా విషయాలను మీడియా పంచుకుంది. దాని వివరాల్లోకి వెళ్లదలుచుకోలేదు. కానీ ఈ పవిత్రమైన సెంగోల్ కీర్తిని, గౌరవాన్ని పునరుద్ధరించగలగడం మన అదృష్టం అని నేను నమ్ముతున్నాను. ఈ పార్లమెంటు భవనంలో కార్యకలాపాలు ఎప్పుడు ప్రారంభమైనా, ఈ సెంగోల్ మనందరికీ స్ఫూర్తినిస్తూనే ఉంటుంది.
మిత్రులారా,
భారతదేశం ప్రజాస్వామ్య దేశమే కాదు, ప్రజాస్వామ్యానికి తల్లి కూడా. నేడు భారతదేశం ప్రపంచ ప్రజాస్వామ్యానికి ప్రధాన స్థావరంగా ఉంది. ప్రజాస్వామ్యం అనేది మనకు ఒక వ్యవస్థ మాత్రమే కాదు. ఇది ఒక సంస్కృతి, ఒక ఆలోచన, ఒక సంప్రదాయం. సభలు, సమితుల ప్రజాస్వామిక ఆదర్శాలను మన వేదాలు మనకు బోధిస్తాయి. మహాభారతం వంటి గ్రంథాలలో ‘గణాలు‘, గణతంత్రాల వ్యవస్థ గురించి ప్రస్తావించబడింది. వైశాలి వంటి రిపబ్లిక్ లలో మనం జీవించాము. బసవేశ్వరుని ‘అనుభవ మండపాన్ని‘ మన గర్వకారణంగా భావించాం. తమిళనాడులో లభించిన క్రీ.శ.900 నాటి శాసనం ఇప్పటికీ అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. మన ప్రజాస్వామ్యమే మనకు స్ఫూర్తి. మన రాజ్యాంగం మన సంకల్పం. ఈ స్ఫూర్తికి, తీర్మానానికి మన పార్లమెంటు ఉత్తమ ప్రతినిధి. ఈ పార్లమెంటు దేశం ప్రాతినిధ్యం వహిస్తున్న గొప్ప సంస్కృతిని ఈ రూపంలో ప్రకటిస్తుంది शेते निपद्य–मानस्य चराति चरतो भगः चरैवेति, चरैवेति– चरैवेति॥ అంటే ఆగినవాడి అదృష్టం కూడా ఆగిపోతుంది. కానీ ముందుకు సాగే వ్యక్తి, అతని భవితవ్యం ముందుకు సాగుతుంది, నూతన శిఖరాలను తాకుతుంది. అందుకని ముందుకు సాగాలి. బానిసత్వం తర్వాత చాలా కోల్పోయిన తర్వాత మన భారతదేశం తన నూతన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని, ఎన్నో సవాళ్లను అధిగమించిన ఆ ప్రయాణం ఇప్పుడు స్వాతంత్య్ర ‘అమృత్ కాల్‘లోకి ప్రవేశించింది. వారసత్వాన్ని పరిరక్షిస్తూ అభివృద్ధిలో నూతన కోణాలను సృష్టించే ‘అమృత్ కాల్‘ స్వాతంత్ర్యానికి సంబంధించిన ఈ ‘అమృత్ కాల్‘. దేశానికి నూతన దిశను అందించే ‘అమృత్ కాల్‘ స్వాతంత్ర్యానికి సంబంధించిన ఈ ‘అమృత్ కాల్‘. అనంతమైన కలలను, అసంఖ్యాక ఆకాంక్షలను నెరవేర్చే ‘అమృత్ కల్‘ స్వాతంత్ర్యానికి సంబంధించిన ఈ ‘అమృత్ కాల్‘. ఈ ‘అమృత్ కాల్‘ పిలుపు –
मुक्त मातृभूमि को नवीन मान चाहिए।
नवीन पर्व के लिए, नवीन प्राण चाहिए।
मुक्त गीत हो रहा, नवीन राग चाहिए।
नवीन पर्व के लिए, नवीन प्राण चाहिए।
(స్వేచ్ఛాయుత మాతృభూమి నూతన విలువలకు అర్హమైనది.
నూతన పండుగకు, నూతన జీవితం అవసరం..
ఒక నూతన పాట పాడుతున్నప్పుడు, మనకు నూతన మెలోడీ అవసరం.
నూతన పండుగకు, నూతన జీవితం అవసరం.)
అందువల్ల, భారతదేశ భవిష్యత్తును ఉజ్వలంగా మార్చబోతున్న ఈ పనిప్రాంతం కూడా అంతే సృజనాత్మకంగా, ఆధునికంగా ఉండాలి.
మిత్రులారా,
ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత సంపన్న, అద్భుతమైన దేశాలలో భారతదేశం ఒకటిగా ఉండేది. భారతదేశపు వాస్తుశిల్పం భారతదేశ నగరాల నుండి రాజభవనాల వరకు, భారతదేశ దేవాలయాల నుండి శిల్పాల వరకు భారతదేశ నైపుణ్యాన్ని ప్రకటించింది. సింధు నాగరికత పట్టణ ప్రణాళిక నుండి మౌర్య స్తంభాలు, స్థూపాల వరకు, చోళులు నిర్మించిన అద్భుతమైన దేవాలయాల నుండి జలాశయాలు, పెద్ద ఆనకట్టల వరకు, భారతదేశ చాతుర్యం ప్రపంచం నలుమూలల నుండి పర్యాటకులను ఆశ్చర్యపరిచింది. కానీ వందల సంవత్సరాల బానిసత్వం ఈ అహంకారాన్ని మన నుంచి దూరం చేసింది. ఒకానొక సమయంలో ఇతర దేశాల్లోని నిర్మాణాల పట్ల ఆకర్షితులయ్యేవాళ్లం. 21వ శతాబ్దపు నవభారతం, ఉన్నత స్ఫూర్తితో నిండిన భారతదేశం, బానిసత్వపు మనస్తత్వాన్ని విడిచిపెడుతోంది. ప్రాచీన కాలం నాటి ఆ మహిమాన్విత ప్రవాహాన్ని నేడు భారతదేశం మరోసారి తనవైపు తిప్పుకుంటోంది. ఈ నూతన పార్లమెంటు భవనం ఈ ప్రయత్నానికి సజీవ చిహ్నంగా మారింది. ఈ రోజు ప్రతి భారతీయుడు నూతన పార్లమెంటు భవనాన్ని చూసి గర్వపడుతున్నాడు. ఈ భవనం వారసత్వంతో పాటు వాస్తుశిల్పాన్ని కలిగి ఉంది. ఈ నిర్మాణంలో కళతో పాటు నైపుణ్యం కూడా ఉంది. అందులో సంస్కృతితో పాటు రాజ్యాంగ స్వరం కూడా ఉంది.
లోక్ సభ లోపలి భాగం జాతీయ పక్షి నెమలిపై ఆధారపడి ఉండటాన్ని మీరు చూడవచ్చు. రాజ్యసభ లోపలి భాగం జాతీయ పుష్పం కమలంపై ఆధారపడి ఉంటుంది. మన జాతీయ వృక్షం మర్రి కూడా పార్లమెంటు ఆవరణలోనే ఉంది. ఈ నూతన భవనం మన దేశంలోని వివిధ ప్రాంతాల వైవిధ్యానికి అనుగుణంగా ఉంది. రాజస్థాన్ నుంచి తెప్పించిన గ్రానైట్, ఇసుకరాయిని ఇందులో ఉపయోగించారు. చెక్క పని మహారాష్ట్రకు చెందినది. యూపీలోని భదోహికి చెందిన కళాకారులు చేతితో కార్పెట్లు నేశారు. ఒకరకంగా చెప్పాలంటే ఈ భవనంలోని ప్రతి కణంలోనూ ‘ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్‘ స్ఫూర్తిని మనం చూస్తాం.
మిత్రులారా,
పార్లమెంటు పాత భవనంలో ప్రతి ఒక్కరూ తమ పనులు నిర్వహించడానికి ఎంత కష్టపడ్డారో మనందరికీ తెలుసు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు సీటింగ్ అరేంజ్ మెంట్ కు సంబంధించిన సమస్యలు తలెత్తాయి. గత రెండున్నర దశాబ్దాలుగా నూతన పార్లమెంటు భవనం ఆవశ్యకతపై దేశం నిరంతరం చర్చిస్తూనే ఉంది. మరి భవిష్యత్తులో సీట్ల సంఖ్య పెరిగి, ఎంపీల సంఖ్య పెరిగినప్పుడు ప్రజలు ఎక్కడ కూర్చుంటారో కూడా ఆలోచించాలి.
అందువల్ల పార్లమెంటుకు నూతన భవనం నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ అద్భుతమైన భవనం ఆధునిక సౌకర్యాలతో ఉండటం చూసి నేను సంతోషిస్తున్నాను. ఈ క్షణంలో కూడా సూర్యరశ్మి నేరుగా ఈ హాలులోకి ప్రవేశిస్తోంది. విద్యుత్ వినియోగాన్ని తగ్గించి, అన్ని చోట్లా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన గ్యాడ్జెట్లు ఉండేలా పూర్తి జాగ్రత్తలు తీసుకున్నారు.
మిత్రులారా,
ఈ ఉదయం, ఈ పార్లమెంటు భవనం నిర్మాణంలో పాలుపంచుకున్న కార్మికుల బృందాన్ని కలిసే అవకాశం నాకు లభించింది. ఈ పార్లమెంటు భవనం సుమారు 60,000 మంది కార్మికులకు ఉపాధి కల్పించింది. వారు తమ చెమటను, శ్రమను ఈ నూతన నిర్మాణాన్ని నిర్మించడానికి వెచ్చించారు. వారి శ్రమను గౌరవించడానికి పార్లమెంటులో ఒక ప్రత్యేక డిజిటల్ గ్యాలరీని ఏర్పాటు చేయడం నాకు సంతోషంగా ఉంది, ఇది బహుశా ప్రపంచంలోనే మొట్టమొదటిది. ఇప్పుడు పార్లమెంటు నిర్మాణంలో వారి సహకారం కూడా చిరస్మరణీయంగా మారింది.
మిత్రులారా,
గత తొమ్మిదేళ్లను ఏ నిపుణుడైనా అంచనా వేస్తే, ఈ తొమ్మిదేళ్లు నూతన నిర్మాణాలు, భారతదేశంలోని పేదల సంక్షేమానికి సంబంధించినవని తెలుస్తుంది. ఈ రోజు, నూతన పార్లమెంటు భవనం నిర్మాణం పట్ల మేము గర్వపడుతున్నాము, కానీ గత తొమ్మిదేళ్లలో పేదల కోసం నాలుగు కోట్ల గృహాలను నిర్మించడం పట్ల నేను సంతృప్తిగా ఉన్నాను. ఈ అద్భుతమైన భవనాన్ని చూసి తలలు పైకెత్తి చూస్తే, గత తొమ్మిదేళ్లలో 11 కోట్ల మరుగుదొడ్ల నిర్మాణం మహిళల గౌరవాన్ని కాపాడి, వారి తలలు పైకెత్తేలా చేసినందుకు నేను సంతృప్తి చెందుతున్నాను. ఈ రోజు మనం ఈ పార్లమెంటు భవనంలో సౌకర్యాల గురించి చర్చిస్తున్నప్పుడు, గత తొమ్మిదేళ్లలో గ్రామాలను అనుసంధానించడానికి మేము 400,000 కిలోమీటర్లకు పైగా రహదారులను నిర్మించామని నేను సంతృప్తి చెందాను. ఎకో ఫ్రెండ్లీగా ఉండే ఈ భవనాన్ని చూసి సంతోషిస్తున్నప్పుడు, ప్రతి నీటి బొట్టును ఆదా చేయడానికి మేము 50,000 ‘అమృత్ సరోవర్స్‘ (నీటి రిజర్వాయర్లు) నిర్మించినందుకు నేను సంతృప్తి చెందుతున్నాను. ఈ నూతన పార్లమెంటు భవనంలో లోక్ సభ, రాజ్యసభలను మనం సంబరాలు చేసుకుంటుంటే, దేశంలో 30,000కు పైగా నూతన పంచాయతీ భవన్ లను (గ్రామ కౌన్సిల్ భవనాలు) నిర్మించినందుకు నేను సంతృప్తి చెందుతున్నాను. మరో మాటలో చెప్పాలంటే, పంచాయతీ భవన్ల నుండి పార్లమెంటు భవనం వరకు, మా అంకితభావం అలాగే ఉంటుంది, మా స్ఫూర్తి మారదు.
దేశాభివృద్ధి ప్రజల అభివృద్ధికి పర్యాయపదం.
మిత్రులారా,
ఆగస్టు 15న ఎర్రకోటపై నుంచి జాతినుద్దేశించి ప్రసంగించినప్పుడు ‘ఇదే సరైన సమయం‘ అని చెప్పిన విషయం మీకు గుర్తుండే ఉంటుంది. ప్రతి దేశ చరిత్రలోనూ దేశ చైతన్యం నూతనగా జాగృతం అయ్యే సందర్భం వస్తుంది. స్వాతంత్య్రానికి ముందు 25 ఏళ్లను, అంటే 1947 వరకు ఇదే పరిస్థితి తలెత్తింది. గాంధీజీ సహాయ నిరాకరణోద్యమం యావత్ దేశంలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. గాంధీజీ ప్రతి భారతీయుడిని స్వయంపాలన సంకల్పంతో అనుసంధానం చేశారు. ప్రతి భారతీయుడు స్వాతంత్ర్యం కోసం మనస్ఫూర్తిగా అంకితమైన సమయం అది, దీని ఫలితాన్ని 1947 లో భారతదేశ స్వాతంత్ర్యంలో మనం చూశాము. స్వాతంత్ర్యం వచ్చిన ఈ ‘అమృత్ కాల్‘ కూడా భారతదేశ చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయి. మరో 25 ఏళ్లలో భారతదేశం వందేళ్ల స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకోనుంది. మన ముందు 25 ఏళ్ల ‘అమృత్‘ పీరియడ్ కూడా ఉంది. ఈ 25 ఏళ్లలో కలిసి పనిచేయడం ద్వారా భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడమే మా లక్ష్యం. లక్ష్యం ప్రతిష్టాత్మకమైనది, మార్గం సవాలుతో కూడుకున్నది, కానీ ప్రతి పౌరుడు మనస్ఫూర్తిగా కట్టుబడి ఉండాలి, నూతన చొరవ తీసుకోవాలి, నూతన తీర్మానాలు చేయాలి, నూతన వేగాన్ని స్వీకరించాలి. భారతీయుల విశ్వాసం ఒక్క భారతదేశానికే పరిమితం కాదనడానికి చరిత్రే సాక్ష్యం. మన స్వాతంత్ర్య పోరాటం ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో నూతన చైతన్యాన్ని రగిలించింది. మన స్వాతంత్ర్య పోరాటం ద్వారా భారతదేశం స్వాతంత్ర్యాన్ని పొందడమే కాకుండా అనేక దేశాలను స్వాతంత్ర్య మార్గంలో ప్రేరేపించింది. భారత్ విశ్వాసం ఇతర దేశాల నమ్మకాన్ని బలపరిచింది. అందువల్ల, విస్తారమైన జనాభా, అనేక సవాళ్లతో భారతదేశం వంటి వైవిధ్యభరితమైన దేశం ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నప్పుడు, అది ప్రపంచంలోని అనేక దేశాలకు ప్రేరణగా నిలుస్తుంది. భారతదేశం సాధించిన ప్రతి విజయం రాబోయే రోజుల్లో ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో వివిధ దేశాల విజయానికి చిహ్నంగా, ప్రేరణకు ఒక కారణం అవుతుంది. ఈ రోజు భారతదేశం పేదరికాన్ని వేగంగా నిర్మూలిస్తే, పేదరికాన్ని అధిగమించడానికి అనేక దేశాలకు స్ఫూర్తినిస్తుంది. అభివృద్ధి చెందిన భారతదేశం కోసం చేసిన తీర్మానం అనేక ఇతర దేశాలకు బలం చేకూరుస్తుంది. అందువల్ల భారత్ బాధ్యత మరింత పెరుగుతుంది.
మిత్రులారా,
విజయానికి మొదటి షరతు తనపై తాను నమ్మకం ఉంచుకోవడం. ఈ నూతన పార్లమెంటు భవనం ఆ నమ్మకాన్ని నూతన శిఖరాలకు తీసుకెళుతుంది. అభివృద్ధి చెందిన భారత నిర్మాణంలో ఇది మనందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. ఈ పార్లమెంటు భవనం ప్రతి భారతీయుడిలో కర్తవ్య భావాన్ని మేల్కొలుపుతుంది. ఈ పార్లమెంటులో కూర్చునే ప్రతినిధులు నూతన స్ఫూర్తితో ప్రజాస్వామ్యానికి నూతన దిశానిర్దేశం చేయడానికి కృషి చేస్తారని నేను నమ్ముతున్నాను. ‘నేషన్ ఫస్ట్‘ స్ఫూర్తితో ముందుకు సాగాలి– इदं राष्ट्राय इदं न मम. మన బాధ్యతలకు ప్రాధాన్యమివ్వాలి – कर्तव्यमेव कर्तव्यं, अकर्तव्यं न कर्तव्यं. అన్నింటికీ మించి మన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. మన ప్రవర్తన ద్వారా మనం ఆదర్శంగా — यद्यदा–चरति श्रेष्ठः तत्तदेव इतरो जनः స్వీయ–మెరుగుదల కోసం నిరంతరం కృషి చేయాలి— उद्धरेत् आत्मना आत्मानम्। మన స్వంత మార్గాన్ని మనం సృష్టించుకోవాలి – अप्प दीपो भव: మనల్ని మనం క్రమశిక్షణలో పెట్టుకోవాలి, ఆత్మపరిశీలన చేసుకోవాలి, స్వీయ నియంత్రణ పాటించాలి— तपसों हि परम नास्ति, तपसा विन्दते महत। ప్రజా సంక్షేమమే మన జీవన మంత్రంగా — लोकहितं मम करणीयम्. ఈ నూతన పార్లమెంటు భవనంలో మన బాధ్యతలను నిజాయితీగా నిర్వర్తిస్తే, దేశ పౌరులు కూడా నూతన స్ఫూర్తిని పొందుతారు.
మిత్రులారా,
ఈ నూతన పార్లమెంటు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి నూతన శక్తిని, బలాన్ని అందిస్తుంది. మా కార్యకర్తలు తమ కృషి, చెమటతో ఈ పార్లమెంట్ భవనాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇప్పుడు మన అంకితభావంతో దీన్ని మరింత దివ్యంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఒక దేశంగా, 140 కోట్ల మంది భారతీయుల సంకల్పమే ఈ నూతన పార్లమెంటుకు జీవశక్తి. ఇక్కడ తీసుకునే ప్రతి నిర్ణయమూ రాబోయే శతాబ్ధాలకు రూపమిస్తుంది, అలంకరిస్తుంది. ఇక్కడ తీసుకునే ప్రతి నిర్ణయం భవిష్యత్ తరాలకు సాధికారత కల్పిస్తుంది. ఇక్కడ తీసుకునే ప్రతి నిర్ణయమూ భారతదేశ ఉజ్వల భవిష్యత్తుకు పునాది వేస్తుంది. పేదలు, దళితులు, అణగారిన వర్గాలు, గిరిజన వర్గాలు, దివ్యాంగులు, ప్రతి వెనుకబడిన కుటుంబం సాధికారతకు మార్గం ఇక్కడే పయనిస్తుంది. ఈ నూతన పార్లమెంటు భవనంలోని ప్రతి ఇటుక, ప్రతి గోడ పేదల సంక్షేమానికి అంకితం చేయబడింది. రాబోయే 25 ఏళ్లలో, ఈ నూతన పార్లమెంటు హౌస్లో చేసిన నూతన చట్టాలు భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మారుస్తాయి. ఈ పార్లమెంటులో చేసిన చట్టాలు భారతదేశంలో పేదరిక నిర్మూలనకు దోహదపడతాయి. ఈ పార్లమెంటులో చేసిన చట్టాలు యువతకు నూతన అవకాశాలను సృష్టిస్తాయి, మహిళలకు సాధికారత కల్పిస్తాయి. ఈ నూతన పార్లమెంటు భవనం నవ భారత నిర్మాణానికి పునాది అవుతుందని నేను నమ్ముతున్నాను. ఇది విధానం, న్యాయం, సత్యం, గౌరవం తో పాటు విధి సూత్రాలకు కట్టుబడి ఉన్న సంపన్న, బలమైన, అభివృద్ధి చెందిన భారతదేశం అవుతుంది. నూతన పార్లమెంటు భవనాన్ని ప్రారంభించిన సందర్భంగా భారత పౌరులందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.
ధన్యవాదాలు!
***********
The new Parliament House is a reflection of the aspirations of new India. https://t.co/qfDGsghJgF
— Narendra Modi (@narendramodi) May 28, 2023
मैं सभी देशवासियों को भारतीय लोकतन्त्र के इस स्वर्णिम क्षण की बहुत-बहुत बधाई देता हूं: PM @narendramodi pic.twitter.com/CzJrYda3Mw
— PMO India (@PMOIndia) May 28, 2023
ये सिर्फ एक भवन नहीं है।
— PMO India (@PMOIndia) May 28, 2023
ये 140 करोड़ भारतवासियों की आकांक्षाओं और सपनों का प्रतिबिंब है।
ये विश्व को भारत के दृढ संकल्प का संदेश देता हमारे लोकतंत्र का मंदिर है। pic.twitter.com/aRxAw40i2n
जब भारत आगे बढ़ता है तो विश्व आगे बढ़ता है।
— PMO India (@PMOIndia) May 28, 2023
संसद का ये नया भवन, भारत के विकास से, विश्व के विकास का भी आह्वान करेगा। pic.twitter.com/k2SmBSxJc7
जब भारत आगे बढ़ता है तो विश्व आगे बढ़ता है।
— PMO India (@PMOIndia) May 28, 2023
संसद का ये नया भवन, भारत के विकास से, विश्व के विकास का भी आह्वान करेगा। pic.twitter.com/k2SmBSxJc7
जब भी इस संसद भवन में कार्यवाही शुरू होगी, सेंगोल हम सभी को प्रेरणा देता रहेगा। pic.twitter.com/mWWVJ8BzcT
— PMO India (@PMOIndia) May 28, 2023
भारत एक लोकतान्त्रिक राष्ट्र ही नहीं बल्कि लोकतन्त्र की जननी भी है, Mother of Democracy भी है। pic.twitter.com/rulDUQAtIq
— PMO India (@PMOIndia) May 28, 2023
हमारा लोकतंत्र ही हमारी प्रेरणा है, हमारा संविधान ही हमारा संकल्प है।
— PMO India (@PMOIndia) May 28, 2023
इस प्रेरणा, इस संकल्प की सबसे श्रेष्ठ प्रतिनिधि, हमारी ये संसद ही है। pic.twitter.com/SdU3oCdE0M
ग़ुलामी के बाद हमारे भारत ने बहुत कुछ खोकर अपनी नई यात्रा शुरू की थी।
— PMO India (@PMOIndia) May 28, 2023
वो यात्रा कितने ही उतार-चढ़ावों से होते हुए, कितनी ही चुनौतियों को पार करते हुए, आज़ादी के अमृतकाल में प्रवेश कर चुकी है। pic.twitter.com/r9R9T5oMYS
आज नए संसद भवन को देखकर हर भारतीय गौरव से भरा हुआ है। pic.twitter.com/Cx2OGJbZfL
— PMO India (@PMOIndia) May 28, 2023
हमारे पास 25 वर्ष का अमृत कालखंड है।
— PMO India (@PMOIndia) May 28, 2023
इन 25 वर्षों में हमें मिलकर भारत को विकसित राष्ट्र बनाना है। pic.twitter.com/HnieE0XrCT
मुझे विश्वास है, इस संसद में जो जनप्रतिनिधि बैठेंगे, वे नई प्रेरणा के साथ, लोकतंत्र को नई दिशा देने का प्रयास करेंगे: PM @narendramodi pic.twitter.com/FPiaIZ8gTu
— PMO India (@PMOIndia) May 28, 2023
संसद का यह नया भवन, नये भारत के सृजन का आधार बनेगा। pic.twitter.com/KEfSEf10f4
— PMO India (@PMOIndia) May 28, 2023