Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రేపు ప్ర‌జా ప‌రిపాల‌న‌లో ప్ర‌తిభా పుర‌స్కారాల ప్ర‌దానం చేయ‌నున్న ప్ర‌ధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల‌ను స‌క్ర‌మంగా అమ‌లుచేస్తూ, ప్ర‌జా ప‌రిపాల‌న‌లో అత్యుత్త‌మ ప్ర‌తిభ క‌న‌బ‌రిచిన జిల్లాలకూ, కేంద్ర, రాష్ట్ర సంస్థలకూ ఏప్రిల్ 21వ తేదీన విజ్ఞాన్ భ‌వ‌న్ లో ప్ర‌తిభా పుర‌స్కారాల‌ను అంద‌జేయ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప్ర‌భుత్వ అధికారుల‌ను ఉద్దేశించి ప్ర‌సంగిస్తారు.

పౌరుల సంక్షేమానికి ఉద్దేశించిన కార్య‌క్ర‌మాల‌ను స‌రైన రీతిలో అమ‌లుచేసే జిల్లాల‌కూ, రాష్ట్ర, కేంద్ర ప్ర‌భుత్వ సంస్థ‌ల‌కూ.. వారి సేవ‌ల‌కు గుర్తింపుగా ప్ర‌జా ప‌రిపాల‌న‌లో ప్ర‌ధాన మంత్రి ప్ర‌తిభా పుర‌స్కారాల‌ను అంద‌జేస్తారు. ఈ అవార్డు కు నాలుగు ప్రాధాన్య‌త కార్య‌క్ర‌మాలు గుర్తించ‌బ‌డ్డాయి. అవి: i) ప్ర‌ధాన మంత్రి ఫ‌స‌ల్ బీమా యోజ‌న‌, ii) డిజిట‌ల్ చెల్లింపులు, iii) ప్ర‌ధాన మంత్రి ఆవాస్ యోజ‌న – ప‌ట్ట‌ణ & గ్రామీణ‌, మ‌రియు iv) దీన్ ద‌యాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశ‌ల్‌ యోజ‌న‌. ఈ కార్య‌క్ర‌మాల అమ‌లుకు గాను 11 అవార్డులు. రెండు అవార్డులు కేంద్ర‌/రాష్ట్ర ప్ర‌భుత్వాలు, జిల్లాల‌కు అంద‌జేస్తారు.

ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి ‘న్యూ పాత్ వేస్’ (నూత‌న మార్గాలు) ‘ఏస్పిరేష‌న‌ల్ డిస్ట్రిక్ట్స్‌: అన్ లాకింగ్ పొటెన్షియ‌ల్స్’ అనే రెండు పుస్త‌కాల‌ను విడుద‌ల చేయనున్నారు.

*****