Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

వికసిత్ భారత్ ‌దిశగా అత్యాధునిక మౌలిక సదుపాయాలు ప్రధానమంత్రి ఉద్ఘాటన


గత పది సంవత్సరాల్లో మౌలిక సదుపాయాలను రికార్డు స్థాయిలో ఉన్నతీకరించారని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలిపారువికసిత్ భారత్ దార్శనికతను సాకారం చేయడానికి దేశ ప్రజలకు తదుపరి తరం మౌలిక సదుపాయాల్ని అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:

‘‘గత పది సంవత్సరాల్లో మౌలిక సదుపాయాలు రికార్డు స్థాయిలో ఉన్నతీకరణకు నోచుకున్నాయిమన వికసిత్ భారత్ దార్శనికతను సాకారం చేయడానికి మన దేశ ప్రజలకు తదుపరి తరం మౌలిక సదుపాయాల్ని అందించేందుకు మేం కట్టుబడి ఉన్నాం’’ అని పేర్కొన్నారు.

 

***