పిఎంఇండియా
కేంద్ర మాజీ మంత్రి శ్రీ రామ్ విలాస్ పాశ్వాన్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఆయనకు నివాళి అర్పించారు. సమాజంలోని అణగారిన-బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన అవిరళ కృషి చేశారని పేర్కొన్నారు. ప్రజలకు, దేశానికి సేవ చేయడంలో ఆయన అంకితభావం సదా స్మరణీయమని వ్యాఖ్యానించారు.
ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
“కేంద్ర మాజీ మంత్రి శ్రీ రామ్ విలాస్ పాశ్వాన్ జయంతి సందర్భంగా ఈ రోజున ఆయనకు నా హృదయపూర్వక నివాళి అర్పిస్తున్నాను. సమాజంలో వెనుకబడి, బలహీన వర్గాల ప్రజానీకం అభ్యున్నతి దిశగా ఆయన కృషి అనిర్వచనీయం. ప్రజలకు, దేశానికి సేవలందించడంలో ఆయన అంకితభావం చిరస్మరణీయం” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
***