పిఎంఇండియా
ఈ రోజు సివిల్ సర్వీసుల దినోత్సవం. ఈ సందర్భంగా సివిల్ సర్వీసు అధికారులందరికీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఇది సుపరిపాలన, దేశ నిర్మాణం దిశగా కృషిచేయాలనే సంకల్పాన్ని మరింత బలోపేతం చేసుకోవాల్సిన సందర్భమని శ్రీ మోదీ అన్నారు. ‘‘క్షేత్ర స్థాయి మొదలు విధాన రూపకల్పన స్థాయి వరకూ.. సివిల్ సర్వెంట్లు తమ కృషితో అసంఖ్యాక ప్రజలకు చేరువ అవుతూ, భారత ప్రగతికి తోడ్పాటును అందిస్తున్నారు. మన సివిల్ సర్వీసు అధికారులు అంకితభావంతోనూ, సహానుభూతితోనూ, నవకల్పనతోనూ సేవలందించడాన్ని కొనసాగించాలనీ, విధినిర్వహణలో అత్యున్నత ప్రమాణాలను పరిరక్షించాలనీ కోరుకుంటున్నాను’’ అని శ్రీ మోదీ అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శ్రీ మోదీ ఒక సందేశాన్ని పొందుపరుస్తూ:
‘‘సివిల్ సర్వీసు అధికారులందరికీ సివిల్ సర్వీసెస్ డే శుభాకాంక్షలు. సుపరిపాలన, దేశ నిర్మాణం దిశగా పనిచేద్దామన్న సంకల్పాన్ని మరింత బలోపేతం చేసుకొనే సందర్భం ఇది. క్షేత్ర స్థాయి మొదలు విధాన రూపకల్పన స్థాయి వరకూ.. అధికారులు తమ కృషితో అసంఖ్యాక ప్రజలకు చేరువ అవుతూ, భారత ప్రగతికి తోడ్పాటును అందిస్తున్నారు. అంకితభావంతో, సహానుభూతితో, నవకల్పనతో సేవలందించడాన్ని వారు కొనసాగించాలనీ, విధినిర్వహణలో అత్యున్నత ప్రమాణాలను పరిరక్షించాలనీ కోరుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు.
***
Greetings to all civil servants on Civil Services Day. This is an occasion to further strengthen the resolve to work towards good governance and nation building. From the grassroots to policy-making, the efforts of civil servants touch countless lives and contribute to India’s…
— Narendra Modi (@narendramodi) April 21, 2026