Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

సైన్య దినోత్సవం సందర్భంగా సైనికుల ధైర్య సాహసాలకు నమస్కరించిన ప్రధానమంత్రి


ఈ రోజు సైన్య దినోత్సవంఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భారతీయ సైన్య అజేయ ధైర్యసాహసాలకీదృఢ సంకల్పానికీ హృదయపూర్వకంగా నమస్కరించారు.
అత్యంత సవాళ్లతో కూడిన పరిస్థితుల్లో దేశ సరిహద్దుల్ని రక్షిస్తున్ననిస్వార్థ సేవలో సర్వోన్నత ఆదర్శాలను పరిరక్షిస్తున్న సైనికుల తిరుగులేని అంకితభావాన్ని శ్రీ మోదీ ప్రశంసించారుఓ సంస్కృత సుభాషితాన్ని ఆయన ప్రజలతో పంచుకున్నారు.
భారతీయ సైన్యానికి ప్రధానమంత్రి నమస్కరించారుజవాన్ల వీరత్వంత్యాగాలకు గాను దేశం తరఫున కృతజ్ఞత‌లు తెలిపారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శ్రీ మోదీ వేర్వేరు సందేశాలను పొందుపరుస్తూ 
‘‘
సైన్య దినోత్సవం సందర్భంగామనం భారతీయ సైన్య ధైర్యసాహసాలకీదృఢ సంకల్పానికీ నమస్కరిద్దాం.
మన జవాన్లు నిస్వార్థ సేవకు ప్రతీకవారు మొక్కవోని సంకల్పంతోఅప్పుడప్పుడూ కఠిన పరిస్థితుల్లో కూడా దేశ ప్రజలను కాపాడుతున్నారువారి అంకితభావం పూర్తి దేశంలో విశ్వాసాన్నీకృతజ్ఞతా భావననీ మేల్కొలుపుతున్నాయి.

కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ తమ ప్రాణాలను అర్పించిన వారినందరినీ అత్యంత శ్రద్ధతో స్మరించుకొందాం’’.

 

‘‘దుర్గమ ప్రాంతాలు మొదలు మంచు కప్పేసిన పర్వత శిఖరాల వరకూ.. మన సైన్య శౌర్యంపరాక్రమం దేశపౌరులు గర్వపడేటట్లు చేస్తున్నాయిసరిహద్దుల్ని సురక్షితంగా ఉంచడంలో నిర్భయంగా నిలబడుతున్న జవాన్లకు హృదయపూర్వక అభినందనలు.
అస్మాకమింద్రసమృతేషు ధ్వజేష్వస్మాకం యా ఇషవస్తా జయన్తు
అస్మాకం వీరా ఉత్తరే భవన్త్వస్మాఁ ఉ దేవా అవతా హవేషు’’.

 

***