పిఎంఇండియా
మనిషి లోలోపలి జ్ఞానానికి ఉన్న ప్రాధాన్యాన్ని వివరించే, ఈ విశ్వంలో నిజమైన సారం అదేనని చాటి చెప్పే ఓ సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పంచుకున్నారు.
నిజమైన జ్ఞానం, దానిని సరైన విధంగా ఉపయోగించడం.. ఇవే ఏ దేశ ప్రగతికైనా మూలాధారమని భారతీయ సంస్కృతీ వారసత్వాలు మనకు బోధిస్తున్నాయని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఈ బాటలో నడుస్తూ, దేశ యువతీయువకులు సమృద్ధ, సాధికార భారత్ను ఆవిష్కరించేందుకు చురుకుగా పని చేస్తున్నారని శ్రీ మోదీ తెలిపారు. ఈ జ్ఞానం మన అందరిలోనూ వెలిసిందనీ, ఇది సామాన్య జ్ఞానాని కన్నా మించిన జ్ఞానమనీ, మహనీయులతో పాటు వివేకవంతులు ఆరాధించేది ఈ జ్ఞానాన్నేననీ ఆయన వివరించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ,
‘‘నిజమైన జ్ఞానం, ఆ జ్ఞానాన్ని సద్వినియోగపరచడం.. ఇవి దేశ ప్రగతికి మూలాధారమని మన సంస్కృతి, మన వారసత్వం మనకు బోధిస్తున్నాయి. ఈ మార్గంలో ముందుకు సాగుతూ ఇవాళ మన దేశ యువతీయువకులు సమృద్ధ, సశక్త భారతాన్ని ఆవిష్కరించే కృషిలో నిమగ్నమయ్యారు.
అన్త:స్థమేవ యజ్ఞానం జ్ఞానాదపి చ యత్పరమ్
తదేవ సర్వసంసారసారం సద్భిరూపాస్యతే
మన లోపల కొలువై ఉన్న జ్ఞానం సామాన్య జ్ఞానం లేదా వెలుపలి జ్ఞానం కన్నా శ్రేష్ఠమైంది. అదే ఈ సమస్త విశ్వంలోని అసలైన సారం. మహానుభావులు, వివేకవంతులు ఈ ఆంతరంగిక జ్ఞానాన్నే ఉపాసిస్తుంటారు’’ అని పేర్కొన్నారు.
***
हमारी विरासत और संस्कृति हमें यही सिखाती आई है कि सच्चा ज्ञान और उसका सदुपयोग ही राष्ट्र की प्रगति का आधार है। इसी मार्ग पर चलकर आज हमारे देश के युवा समृद्ध और सशक्त भारत को गढ़ने में जुटे हैं।
— Narendra Modi (@narendramodi) April 9, 2026
अन्तःस्थमेव यज्ज्ञानं ज्ञानादपि च यत्परम्।
तदेव सर्वसंसारसारं सद्भिरुपास्यते॥ pic.twitter.com/JHwoZmnM54