పిఎంఇండియా
జాతిపిత మహాత్మాగాంధీ వర్థంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు నివాళులు అర్పించారు. స్వదేశీ భావనకు బాపు ఎల్లప్పుడూ ప్రాధాన్యమిచ్చేవారని, ఇదే అభివృద్ధి చెందిన, స్వావలంబన సాధించిన భారత్ అనే సంకల్పానికి మూలాధారమని శ్రీ మోదీ అన్నారు. ‘‘ఆయన వ్యక్తిత్వం, చేసిన పనులు కర్తవ్య మార్గంలో నడిచేలా ఈ దేశ ప్రజలను ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తూనే ఉంటాయి’’ అని శ్రీ మోదీ చెప్పారు.
సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రధానమంత్రి పోస్టు:
‘‘జాతి పిత మహాత్మాగాంధీ వర్థంతి సందర్భంగా హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నాను. స్వదేశీ భావనకు పూజనీయులైన బాపు ఎల్లప్పుడూ ప్రాధాన్యమిచ్చేవారు. ఇది వికసిత్, ఆత్మనిర్భర భారత్ సాధించాలనే మన సంకల్పానికి ఆధారభూతంగా నిలిచింది. కర్తవ్య మార్గంలో నడిచేలా ఈ దేశ ప్రజలకు ఆయన వ్యక్తిత్వం, కృషి ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తూనే ఉంటాయి.’’
राष्ट्रपिता महात्मा गांधी को उनकी पुण्यतिथि पर मेरा शत-शत नमन। पूज्य बापू का हमेशा स्वदेशी पर बल रहा, जो विकसित और आत्मनिर्भर भारत के हमारे संकल्प का भी आधारस्तंभ है। उनका व्यक्तित्व और कृतित्व देशवासियों को कर्तव्य पथ पर चलने के लिए सदैव प्रेरित करता रहेगा।
— Narendra Modi (@narendramodi) January 30, 2026