పిఎంఇండియా
భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే దార్శనికతకు అనుగుణంగా ఉన్న చారిత్రాత్మక భారత్–యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై కేంద్రమంత్రి శ్రీ పీయూష్ గోయల్ రాసిన వ్యాసాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు పంచుకున్నారు. ‘‘మార్కెట్లను విస్తరిస్తూ, ఉద్యోగాలను సృష్టిస్తూ, దేశ ప్రధాన ప్రయోజనాలను కాపాడే ఒక విప్లవాత్మక ఒప్పందాన్ని ప్రభుత్వం అమలు చేసిన తీరును కేంద్రమంత్రి ఈ వ్యాసంలో గొప్పగా వివరించారు’’ అని శ్రీ మోదీ పేర్కొన్నారు.
సామాజిక మాధ్యమం ఎక్స్ లో కేంద్రమంత్రి శ్రీ పీయూష్ గోయల్ చేసిన పోస్ట్పై స్పందిస్తూ ప్రధానమంత్రి ఇలా అన్నారు.
‘‘కేంద్రమంత్రి శ్రీ పీయూష్ గోయల్ రాసిన ఈ కథనం ప్రతి ఒక్కరూ చదవాల్సిందే. భారత్–ఈయూ మధ్య కుదిరిన చారిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం.. భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే మన దార్శనికతకు పూర్తి అనుగుణంగా ఉన్న విధానాన్ని ఆయన ఈ వ్యాసంలో వివరించారు. మార్కెట్లను విస్తరించడం, ఉద్యోగ అవకాశాలను సృష్టించడం, భారతదేశ ప్రధాన ప్రయోజనాలను కాపాడటంలో ప్రభుత్వం ఒక విప్లవాత్మక ఒప్పందాన్ని అందించిన తీరును ఈ కథనంలో ప్రస్తావించారు’’.
In this must-read article, Union Minister Shri @PiyushGoyal writes about the historic India-EU Free Trade Agreement that fully aligns with the vision of making India a developed country.
— PMO India (@PMOIndia) January 30, 2026
He highlights that the government has delivered a transformative agreement that expands… https://t.co/8qn84Ppt2H