పిఎంఇండియా
ఉత్తరప్రదేశ్లోని మధురలో జరిగిన పడవ ప్రమాదంలో ప్రాణనష్టం సంభవించడం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
ఈ దురదృష్టకర ప్రమాదంలో తమ ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు ప్రధానమంత్రి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ విషాద సమయంలో బాధితులకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అందించడంలో స్థానిక యంత్రాంగం నిమగ్నమై ఉందని ప్రధానమంత్రి తెలిపారు.
సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రధానమంత్రి ఈ విధంగా స్పందించారు.
‘‘ఉత్తరప్రదేశ్లోని మధురలో పడవ బోల్తా పడిన ఘటన తీవ్ర బాధను కలిగించింది. తమ ఆత్మీయులను కోల్పోయిన వారికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. స్థానిక యంత్రాంగం బాధితులకు అవసరమైనన సాయం అందిస్తోంది.’’
***
Deeply pained by the mishap due to the capsizing of a boat in Mathura, Uttar Pradesh. My condolences to those who have lost their near and dear ones. I pray for the speedy recovery of the injured. The local administration is assisting those affected: PM @narendramodi
— PMO India (@PMOIndia) April 10, 2026