Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఎన్ సీ సీ ర్యాలీలో ప్ర‌ధాన మంత్రి వ్యాఖ్య‌లు

ఎన్ సీ సీ ర్యాలీలో ప్ర‌ధాన మంత్రి వ్యాఖ్య‌లు


మాతృ దేశం కోసం, ప్ర‌జ‌ల సంక్షేమం కోసం ఎన్ సీ సీ కాడెట్ లు వారి జీవితాల‌ను అంకితం చేయాల‌ని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈరోజు పిలుపునిచ్చారు. ఎన్ సీ సీ ర్యాలీ సంద‌ర్భంగా దేశం న‌లుమూల‌ల నుంచి త‌ర‌లి వ‌చ్చిన కాడెట్ లను ఉద్దేశించి ఆయ‌న ప్ర‌సంగించారు. గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడుక‌లకు ఢిల్లీకి వ‌చ్చి గ‌త నెల రోజులకు పైగా వారు తెలుసుకున్న మంచి విష‌యాల‌ను ఆచ‌ర‌ణ‌లో పెట్టాల‌ని, అంతే కాకుండా వారు తిరిగి త‌మ ప‌ల్లెల‌కు, ప‌ట్ట‌ణాల‌కు వెళ్ళిన త‌రువాత ప‌రిశుభ్ర‌త‌, దేశ‌ భ‌క్తి వంటి విలువ‌ల గురించి ప్ర‌చారం చేయాల‌ని ఆయ‌న చెప్పారు. ఎన్ సీ సీ అనేది దేశంలో ఏ ప్రాంతానికి చెందిన యువ‌తీ యువ‌కుల‌నైనా ఒక్క‌టిగా నిలిపి ఉంచే సంస్థ అని, కాబ‌ట్టి అది దేశ స‌మైక్య‌త‌కు పాటుప‌డుతుంద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

ఈ సంవ‌త్స‌రం గ‌ణ‌తంత్ర దినంతో పాటే భార‌త రాజ్యాంగ శిల్పి బాబాసాహెబ్ అంబేద్క‌ర్ 125వ జ‌యంతి వేడుక‌ల‌ను స్మ‌రించుకున్న విష‌యాన్ని ప్ర‌ధాన‌ మంత్రి గుర్తు చేశారు. బాబాసాహెబ్ అంబేద్క‌ర్ ఆయ‌న జీవితంలో ప్ర‌తి మ‌లుపు వ‌ద్ద ప్ర‌తికూల ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటూనే, ఆ మధ‌నం నుంచి రాజ్యాంగం అనే సుధ ను మ‌న‌కు అందించార‌ని, ఇప్ప‌టికి అనేక ద‌శాబ్దాలు గ‌డ‌చిన త‌రువాత కూడా మ‌న అంద‌ర‌మూ భుజం భుజం క‌లిపి ముందుకు సాగ‌డానికి రాజ్యాంగం ఊతం అందిస్తోంద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.