Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పౌరులే ప్రధానంగా సాగే పాలన, రాజ్యాంగ విలువలపై కథనాన్ని పంచుకున్న ప్రధానమంత్రి


గణతంత్ర దినోత్సవం సందర్భంగా రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్‌ సింగ్ రాసిన కథనాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు.

నేటి పాలనలో పౌరులే ప్రధానమని ఈ కథనం వివరిస్తుంది. సామాజిక న్యాయాన్ని పెంపొందిస్తూఆర్థిక సమ్మిళితత్వాన్ని మన గణతంత్ర రాజ్యం సాధ్యం చేస్తుందనిఈ ఉమ్మడి కృషి ద్వారా రాజ్యాంగం నిర్దేశించిన సంక్షేమ ప్రజాస్వామ్య గణతంత్ర దార్శనికతను కాపాడుతుందని పేర్కొంటుంది.

పైన చెప్పిన కథనంపై రక్షణ మంత్రి చేసిన ‘ఎక్స్‘ పోస్టుకు స్పందిస్తూ శ్రీ నరేంద్ర మోదీ ఇలా పేర్కొన్నారు:

గణతంత్ర దినోత్సవం సందర్భంగానేటి పరిపాలనలో పౌరులే ప్రధానమని రక్షణమంత్రి శ్రీ @rajnathsingh ji తెలిపారుమన గణతంత్రం సామాజిక న్యాయాన్ని పెంపొందించటంతో పాటు ఆర్థిక సమ్మిళితత్వాన్ని సాధ్యం చేస్తోందని ఆయన అన్నారుమన రాజ్యాంగం ఆశించిన సంక్షేమ ఆధారిత ప్రజాస్వామ్య గణతంత్ర దార్శనికతను ఈ ఉమ్మడి కృషి నిలబెడుతుంది“.