పిఎంఇండియా
ప్రతిభ పొంపెందాలంటే సరి అయిన వాతావరణం, తగిన మార్గదర్శకత్వంతో పాటు పోషణ ముఖ్యమని చెబుతున్న ఓ సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రస్తావించారు.
సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:
‘‘అసలైన ప్రతిభకు సకారాత్మక, అనుకూల వాతావరణం జతపడినప్పుడు, అది అద్భుత శక్తిని ప్రకటిస్తుంది. ఫలితంగా ప్రయత్నాలు ఫలించడంతో పాటు జీవితం సార్థకమవుతుంది.
పాత్రవిశేషే న్యస్తం గుణాన్తరం వ్రజతి శిల్పమాధాతుః
జలమివ సముద్రశుక్తౌ ముక్తాఫలతతాం పయోదయస్య’’ అని పేర్కొన్నారు.
ఏ వ్యక్తి లేదా వస్తువు విలువ, గొప్పతనం చాలా వరకు అవి అందుకొనే వాతావరణం, మార్గదర్శకత్వంపై ఆధారపడతాయి. నీటి బిందువు నత్తగుల్ల చిప్పలోకి ప్రవేశిస్తే అమూల్య ముత్యంగా మారినట్లుగానే, సాధారణ సామర్థ్యాలు కూడా సరి అయిన చోటు, తగిన సహకారం, అనుకూలమైన పాలన, పోషణలు లభించినప్పుడు అసాధారణంగా మారుతాయి అని మనకు ఈ సుభాషితం బోధిస్తోంది.
सच्ची प्रतिभा को जब सकारात्मक परिवेश मिलता है तो उससे अद्भुत ऊर्जा का संचार होता है। इससे जहां प्रयासों में सफलता मिलती है, वहीं जीवन भी सार्थक बनता है।
— Narendra Modi (@narendramodi) September 3, 2026
पात्रविशेषे न्यस्तं गुणान्तरं व्रजति शिल्पमाधातुः।
जलमिव समुद्रशुक्तौ मुक्ताफलतां पयोदयस्य॥ pic.twitter.com/2ha6KJaYke