Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

బార్బడోస్ ఎన్నికల్లో ప్రధాని మియా అమోర్ మోట్‌లీ వరుసగా మూడో సారి


బార్బడోస్ ఎన్నికల్లో వరుసగా మూడో సారి విజయాన్ని సాధించి చరిత్ర సృష్టించిన ప్రధాని మియా అమోర్ మోట్‌లీకి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారుబార్బడోస్ దీర్ఘకాలిక మైత్రికి భారత్ ఎనలేని ప్రాధాన్యాన్నిస్తోందనీపరస్పర సహకారాన్ని వివిధ రంగాల్లోకి విస్తరింపచేసుకొంటున్నామనీ శ్రీ మోదీ అన్నారు. ‘‘2024లో భారత్కేరికామ్ శిఖరాగ్ర సదస్సు సందర్బంగా మనం భేటీ అయిన సంగతిని నేను గుర్తు చేసుకొంటున్నానుమన రెండు దేశాల ప్రజల హితాన్ని కోరుకుంటూ మన భాగస్వామ్యాన్ని మరింత పటిష్ఠపరుచుకోవడానికి ఆమెతో కలిసి పనిచేయాలని నేను ఎదురుచూస్తున్నాను’’ అని శ్రీ మోదీ అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో  ఒక సందేశాన్ని ప్రధానమంత్రి శ్రీ మోదీ పొందుపరుస్తూ 
‘‘
ఎన్నికల్లో వరుసగా మూడో సారి గెలిచిచరిత్రను సృష్టించినందుకు ప్రధాని మియా అమోర్ మోట్‌లీకి హృదయపూర్వక అభినందనలు.

బార్బడోస్ తో భారత్ తన దీర్ఘకాలిక మైత్రికి ఎంతో ప్రాధాన్యాన్నిస్తోంది.. ఈ మైత్రి వివిధ రంగాల్లో పరస్పర సహకారం రూపేణా నిరంతరాయంగా విస్తరిస్తోంది.
2024
లో భారత్కేరికామ్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా మనం సమావేశమైన సంగతి నాకు జ్ఞ‌ాపకముందిమన ప్రజల మేలు కోసం మన భాగస్వామ్యాన్ని మరింత దృఢపరుచుకోవడానికి ఆమెతో కలిసి పనిచేయాలని నేను ఎదురుచూస్తున్నాను’’ అని పేర్కొన్నారు.

 

***