పిఎంఇండియా
భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు.. గౌరవ లిచ్టెన్స్టెయిన్ యువరాజు అలోయిస్ భారత్లో పర్యటించి, న్యూఢిల్లీలో జరుగుతున్న ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ – 2026లో పాల్గొన్నారు.
సదస్సు సందర్భంగా గౌరవ యువరాజు అలోయిస్తో 2026 ఫిబ్రవరి 20న భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. భారత్, లిచ్టెన్స్టెయిన్ మధ్య సుహృద్భావ, స్నేహపూర్వక ద్వైపాక్షిక సంబంధాలున్నాయని ఇరువురు నేతలూ స్పష్టం చేశారు.
2025 అక్టోబరులో భారత్ – టీఈపీఏ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమలును వారిద్దరూ స్వాగతించారు. ఈ ఒప్పందం ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలకు కొత్త ఉత్తేజాన్నిస్తుందని వారు ధీమా వ్యక్తం చేశారు. వచ్చే 15 ఏళ్లలో ఈ ఒప్పందం ద్వారా భారత్లోకి 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వస్తాయని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా అత్యున్నత విలువ కలిగిన ఉత్పాదకత, అత్యాధునిక సాంకేతికతలు, ఆవిష్కరణల ఆధారిత రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని వారిద్దరూ నిర్ణయానికి వచ్చారు.
భారత్ – లిచ్టెన్స్టెయిన్ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ఈ సమావేశం ఒక కీలక ముందడుగు. రెండు దేశాలకూ ప్రయోజనకరమైన సహకారాన్ని విస్తరించుకునే దిశగా ఉమ్మడి నిబద్ధత ఈ సమావేశం ద్వారా స్పష్టమవుతోంది.
****
Met HSH Hereditary Prince Alois of Liechtenstein in Delhi earlier today. Discussed the strong potential of economic linkages between our nations, particularly after the India-EFTA and cooperation in areas such as innovation, technology, skilling, R&D among others. pic.twitter.com/fvLuIZNwBu
— Narendra Modi (@narendramodi) February 20, 2026