Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భారత్‌ 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రపంచ నాయకులకు ప్రధానమంత్రి ధన్యవాదాలు


 ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, 77వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన ప్రపంచ నాయకులకు ఈ రోజు కృతజ్ఞతలు తెలియజేశారు.

భూటాన్ ప్రధాని సామాజిక మాధ్యమం ఎక్స్‌లో చేసిన పోస్టుకు ప్రధాని స్పందిస్తూ:

‘‘భారత 77వ  గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన ప్రధాని షెరింగ్ తోబ్గేకుభూటాన్ ప్రజలకు ధన్యవాదాలుమన దేశాల మధ్య ఉన్న ప్రత్యేక స్నేహ సంబంధాలు మరింత బలోపేతం కావాలని కోరుకుంటున్నాను.

@tsheringtobgay’’

 

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఫ్రాన్స్ అధ్యక్షుడు చేసిన పోస్టుకు ప్రధానమంత్రి స్పందిస్తూ: 

‘‘భారత 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నా మిత్రుడు అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మెక్రాన్‌కు ధన్యవాదాలుభారత్‌లో మీ పర్యటన కోసంభారత్ఫ్రాన్స్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతంవైవిద్యీకరించేందుకు ఎదురుచూస్తున్నాను.

@EmmanuelMacron’’

 

సైప్రస్ అధ్యక్షుడు చేసిన పోస్టుకు శ్రీ మోదీ స్పందిస్తూ:

‘‘అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడ్యులీడీస్.. మీరందించిన ఆత్మీయ శుభాకాంక్షలకు ధన్యవాదాలుసన్నిహిత మిత్రునిగావిశ్వసనీయ భాగస్వామిగా ఉన్న సైప్రస్‌తో మా సమగ్ర భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు కట్టుబడి ఉన్నాంభారత్‌లో మీ పర్యటన కోసం ఎదురుచూస్తున్నాను.

@Christodulides’’

 

మాల్దీవుల అధ్యక్షుడు చేసిన పోస్టుకు శ్రీ మోదీ స్పందిస్తూ..

‘‘అధ్యక్షుడు మయిజ్జు… భారత 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మీరందించిన శుభాకాంక్షలుఅభినందనలకు ధన్యవాదాలుఇరుదేశాల ప్రజలకు ప్రయోజనం చేకూరేలా చేస్తున్న కృషిని మనం కొనసాగిద్దాంరాబోతున్న పండగ సీజన్ నేపథ్యంలో మీకుమా మాల్దీవుల మిత్రులకు శుభాకాంక్షలు.

@MMuizzu’’