పిఎంఇండియా
ముంబైలోని బాంద్రా-వర్లీ సముద్ర సంధాన మార్గంలో ప్రమాదం వల్ల ప్రాణనష్టం సంభవించడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రధాని ఆకాంక్షించారు.
ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ఒక ట్వీట్ ద్వారా పంపిన సందేశంలో:
“ముంబైలోని బాంద్రా-వర్లీ సముద్ర సంధాన మార్గంలో సంభవించిన ప్రమాదంలో ప్రాణనష్టం వాటిల్లడం నన్నెంతగానో బాధించింది. ఈ దుర్ఘటనలో ఆప్తులను కోల్పోయిన కుటుంబాలకు నా సంతాపం తెలియజేస్తున్నాను. క్షతగాత్రులు సత్వరం కోలుకోవాలని ఆ దైవాన్ని ప్రార్థిస్తున్నాను.” అని ఆయన పేర్కొన్నారు.
Pained by the loss of lives due to an accident on the Bandra-Worli Sea Link in Mumbai. Condolences to the bereaved families. I hope that those who have been injured have a speedy recovery: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 5, 2022
*****
DS/TS
Pained by the loss of lives due to an accident on the Bandra-Worli Sea Link in Mumbai. Condolences to the bereaved families. I hope that those who have been injured have a speedy recovery: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 5, 2022