పిఎంఇండియా
తనకు ఆత్మీయ శుభాకాంక్షలు తెలిపిన లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు కృతజ్ఞతలు తెలిపారు. భారత ప్రజాస్వామ్యంలో ఈ చరిత్రాత్మక మైలురాయిని చేరుకోవడం ప్రజల అపారమైన ఆశీస్సులు, అభిమానాల ఫలితమేనని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
అభివృద్ధి చెందిన, స్వయం సమృద్ధ, సంపన్న భారత్ను నిర్మించాలనే సంకల్పాన్ని మనమంతా మరింత దృఢ నిశ్చయంతో కలిసికట్టుగా ముందుకు తీసుకువెళదామని శ్రీ మోదీ ఉద్ఘాటించారు.
‘ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
“గౌరవనీయ ఓం బిర్లా గారూ, మీ హృదయపూర్వక శుభాకాంక్షలకు చాలా ధన్యవాదాలు. భారత ప్రజాస్వామ్యంలో ఈ చరిత్రాత్మక మైలురాయిని చేరుకోవడం దేశ ప్రజల అపారమైన ఆశీస్సులు, అభిమానాల ఫలితమే. అభివృద్ధి చెందిన, స్వయం సమృద్ధ, సుసంపన్న భారత్ను నిర్మించాలనే సంకల్పాన్ని మనం కలిసికట్టుగా మరింత దృఢ నిశ్చయంతో ముందుకు తీసుకువెళ్దాం’’.
***
आपकी स्नेहिल शुभकामनाओं के लिए बहुत-बहुत आभार माननीय ओम बिरला जी। भारतीय लोकतंत्र में यह ऐतिहासिक पड़ाव जनता-जनार्दन के अपार आशीर्वाद और अपनत्व का सुपरिणाम है। हम सभी मिलकर विकसित, आत्मनिर्भर और समृद्ध भारत के निर्माण के संकल्प को और अधिक दृढ़ता के साथ आगे बढ़ाते रहेंगे।… https://t.co/8FsCitrxYm
— Narendra Modi (@narendramodi) June 10, 2026