పిఎంఇండియా
సిక్కిం 51వ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎం. సింధియా రాసిన ఒక కథనాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పంచుకున్నారు.
సిక్కిం నేల, జ్ఞాపకాలు, చైతన్యానికి కాంచన్జంగా రక్షణగా ఉందన్న ప్రధాని.. ఈ కథనం దాని ప్రాధాన్యతను తెలియజేస్తోందని పేర్కొన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు:
“సిక్కిం రాష్ట్రానికి 51 సంవత్సరాలు నిండిన సందర్భంగా కాంచన్జంగా గురించి కేంద్ర మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎం. సింధియా ఒక వ్యాసం రాశారు. అది సిక్కిం నేల, జ్ఞాపకాలు, చైతన్యానికి రక్షకుడిగా ఉందని ఆయన కొనియాడారు.
కాంచన్జంగా పంచ నిధులు ఈ రాష్ట్ర ప్రగతి ప్రయాణాన్ని నిరంతరం నడిపిస్తూ ‘వికసిత్ సిక్కిం 2047′ సాధనకు మార్గం సుగమం చేస్తున్నాయని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు.”
***
As Sikkim enters it's 51st year of statehood, Union Minister Shri @JM_Scindia writes about Khangchendzonga, lauding it as the protector of the land, memory and consciousness of Sikkim.
— PMO India (@PMOIndia) May 24, 2026
He highlights that the five treasures of Khangchendzonga continue to illuminate the state's… https://t.co/4XTfm09Upz