పిఎంఇండియా
శాంతి, సుఖ సంతోషాలు, ప్రకృతితో సద్భావన నెలకొల్పడానికి ప్రార్థనలు ముఖ్యమని చాటుతున్న ఓ సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:
‘‘శం నో వాతః పవతాం శం నస్తపతు సూర్యః
శం నః కనిక్రదద్ దేవః పర్జన్యోభివర్షతు’’ అని పేర్కొన్నారు.
‘మన కోసం గాలి శాంతంగా, ఆరోగ్యవర్ధకంగా, పరిశుద్ధంగా వీయునుగాక. సూర్య కిరణాలు మన సంక్షేమానికి, ఆశీర్వాదానికి మూలంగా మారి, మన పైన ప్రసరించుగాక. వాటి వెచ్చదనం, వెలుగు మనకు సుఖాన్ని, ఆనందాన్ని ప్రసాదించుగాక. వరుణ దేవుడు ‘పర్జన్యుడు’ మనకు ప్రాణశక్తి ప్రదాయకమూ, మంగళకరమూ అయిన వానలను కురిపించుగాక’ అనే సందేశాన్ని పైన ప్రస్తావించిన సుభాషితం మనకు అందిస్తున్నది.
***
शं नो वातः पवतां शं नस्तपतु सूर्यः।
— Narendra Modi (@narendramodi) September 7, 2026
शं नः कनिक्रदद् देवः पर्जन्योऽभिवर्षतु॥ pic.twitter.com/76Ihi3JKkU