Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

శ్రీ గోవింద్ భాయ్ పర్మార్ మృతిపై ప్రధానమంత్రి సంతాపం


గుజరాత్ శాసనసభ సభ్యులు శ్రీ గోవింద్ భాయ్ పర్మార్ మృతి పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌ లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు.

‘‘గుజరాత్ శాసనసభ సభ్యులు శ్రీ గోవింద్ భాయ్ పర్మార్ మరణ వార్త నన్ను తీవ్రంగా కలిచివేసింది. సామాజిక సేవా కార్యక్రమాలపై ఆయన ఎల్లప్పుడూ అంకితభావంతో, ముందుండే వారు.

ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ..  వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను

ఓం శాంతి..’’