Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

సంప్రదాయ వైద్యంపై డబ్ల్యూ‌హెచ్‌వో రెండో అంతర్జాతీయ సదస్సు ముగింపు కార్యక్రమంలో ప్రసంగించనున్న ప్రధాని


న్యూఢిల్లీలోని భారత్ మండపంలో 2025 డిసెంబర్ 19 సాయంత్రం 4:30కు సంప్రదాయ వైద్యంపై డబ్ల్యూ‌హెచ్‌వో నిర్వహిస్తున్న రెండో అంతర్జాతీయ సదస్సు ముగింపు కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రసంగిస్తారుఅంతర్జాతీయశాస్త్రీయ ఆధారితప్రజా కేంద్రక సంప్రదాయ వైద్య అజెండాను రూపొందించడంలో పెరుగుతున్న భారత్ నాయకత్వ స్థాయినిచేపడుతున్న మార్గదర్శక పథకాలను ఈ కార్యక్రమం వివరిస్తుంది.

పరిశోధనప్రామాణీకరణఅంతర్జాతీయ సహకారం ద్వారా సంప్రదాయ వైద్యాన్నిభారతీయ విజ్ఞాన వ్యవస్థను ప్రధాన స్రవంతిలోకి తీసుకువచ్చేందుకు ప్రధానమంత్రి ప్రాధాన్యమిస్తున్నారుఈ దార్శనికతకు అనుగుణంగాఆయుష్ రంగంలో మై ఆయుష్ సమీకృత సేవల పోర్టల్ (ఎంఏఐఎస్‌పీ)తో సహా పలు కార్యక్రమాలను ప్రధానమంత్రి ప్రారంభిస్తారుఅలాగే ఆయుష్ ఉత్పత్తులుసేవలు నాణ్యతకు అంతర్జాతీయ ప్రామాణికంగా రూపొందించిన ఆయుష్ మార్కును ఆవిష్కరిస్తారు.

యోగా శిక్షణలో డబ్ల్యూహెచ్‌వో సాంకేతిక నివేదికను ప్రధానమంత్రి ఈ కార్యక్రమంలో విడుదల చేస్తారుఅలాగే ‘‘ఫ్రం రూట్స్ టు గ్లోబల్ రీచ్: 11 ఇయర్స్ ఆఫ్ ట్రాన్సఫర్మేషన్ ఇన్ ఆయుష్’’ అనే పుస్తకాన్ని ఆవిష్కరిస్తారుఅంతర్జాతీయంగా ప్రాచుర్యం పొందుతున్న భారతీయ సంప్రదాయ వైద్య వారసత్వాన్ని సూచిస్తూ.. అశ్వగంధపై స్మారక తపాలా బిళ్లను కూడా విడుదల చేస్తారు.

2021-2025 సంవత్సరాల్లో యోగా ప్రచారానికిఅభివృద్దికి విశేష కృషి చేసిన వారికి ప్రధానమంత్రి పురస్కార గ్రహీతలను ఆయన సత్కరిస్తారుఇది అంతర్జాతీయంగా యోగాను ప్రచారం చేయడంలో వారి అంకితభావానికి దక్కిన గుర్తింపుసమతౌల్యంఆరోగ్యంసామరస్యాన్ని కాలానికి అతీతంగా చేసే సాధనగాఆరోగ్యమైనదృఢమైన కొత్త భారత్‌ను తయారు చేసేందుకు దోహదపడేదిగా యోగాను ఈ పురస్కారాలు గుర్తిస్తాయి.

భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా అనుసరిస్తున్న సంప్రదాయ వైద్య విజ్ఞాన వ్యవస్థల వైవిధ్యాన్నిస్థాయినిప్రస్తుత సమయంలో వాటి ప్రాధాన్యాన్ని వివరించే ‘ట్రెడిషనల్ డిస్కవరీ మెడిసిన్ స్పేస్’ ఎగ్జిబిషన్ను ప్రధాని సందర్శిస్తారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో), ఆయుష్ మంత్రిత్వ శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం 2025 డిసెంబర్ 17 నుంచి 19 వరకు కొనసాగుతుంది. ‘‘రిస్టోరింగ్ బ్యాలెన్స్ది సైన్స్ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ హెల్త్ అండ్ వెల్‌బీయింగ్’’ అనే ఇతివృత్తంతో న్యూఢిల్లోని భారత్ మండపంలో ఈ కార్యక్రమం జరుగుతోందిసమానమైనసుస్థిరమైనసాక్ష్యం ఆధారిత ఆరోగ్య వ్యవస్థల అభివృద్ధిపై ఈ సదస్సులో జరిగిన చర్చల్లో ప్రపంచ నాయకులువిధాన రూపకర్తలుశాస్త్రవేత్తలువైద్యులుదేశీయ పరిజ్ఞానం ఉన్నవారుపౌర సమాజ ప్రతినిధులు పాల్గొన్నారు.

 

***