పిఎంఇండియా
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్తో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంభాషించారు. పశ్చిమాసియాలో పరిస్థితులపైనా, ఉద్రిక్తతలను తగ్గించి చర్చలనూ, దౌత్యాన్నీ పునరుద్ధరించాల్సిన ఆవశ్యకతపైనా చర్చించారు. ఈ ప్రాంతంలోనూ, ప్రపంచవ్యాప్తంగానూ శాంతి, స్థిరత్వాలను పెంపొందించే దిశగా సన్నిహిత సమన్వయంతో కూడిన కృషిని కొనసాగించాలని భారత ప్రధానమంత్రి శ్రీ మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
‘‘పశ్చిమాసియాలో పరిస్థితులపైనా, ఉద్రిక్తతలను తగ్గించడంతోపాటు శాంతినీ, దౌత్యాన్నీ పునరుద్ధరించాల్సిన ఆవశ్యకతపైనా ప్రియ మిత్రుడు, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్తో మాట్లాడాను.
ఈ ప్రాంతంలోనూ, ప్రపంచవ్యాప్తంగానూ శాంతి, స్థిరత్వాలను పెంపొందించే దిశగా సన్నిహిత సమన్వయంతో కూడిన కృషిని కొనసాగించాలని ఏకాభిప్రాయానికి వచ్చాం.’’
***
Spoke with my dear friend, President Emmanuel Macron, on the situation in West Asia and the urgent need for de-escalation, as well as a return to dialogue and diplomacy.
— Narendra Modi (@narendramodi) March 19, 2026
We look forward to continuing our close coordination to advance peace and stability in the region and…