Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పరశురాముడి జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శుభాకాంక్షలు


భగవాన్‌ పరశురాముడి జయంతి సందర్భంగా దేశ పౌరులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడటానికిసత్య మార్గంలో స్థిరంగా కొనసాగడానికి భగవాన్ పరశురాముడు మనకు స్ఫూర్తినిస్తారని శ్రీ మోదీ అన్నారుపరశురాముడు సాటిలేని శౌర్యానికీఅపార జ్ఞానానికీ నిదర్శనమని కొనియాడారు.

పరశురాముని ఆశీస్సులతో ప్రతి ఒక్కరి హృదయం నూతన శక్తితోఆత్మవిశ్వాసంతో నిండాలని ప్రధానమంత్రి ఆకాంక్షించారుఆయన ఆశీస్సులు అందరి జీవితాల్లో ఆనందంశాంతిసిరిసంపదలు నింపాలని కోరారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధాని ఈ విధంగా అన్నారు.

‘‘పరశురాముడి జయంతి సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలుఅన్యాయానికి వ్యతిరేకంగా నిలబడటానికిసత్య మార్గంలో స్థిరంగా నిలవడానికి ఆయన మనకు స్ఫూర్తినిస్తారుసాటిలేని శౌర్యానికిజ్ఞానానికి ప్రతీక అయిన పరశురాముని అనుగ్రహం ప్రతి ఒక్కరిలో నూతన శక్తినీవిశ్వాసాన్నీ నింపాలని కోరుకుంటున్నానుఅందరి జీవితాలూ సుఖశాంతులుసిరిసంపదలతో తులతూగాలని ఆశిస్తున్నాను’’

***