పిఎంఇండియా
సత్యం, సామరస్యం, సత్ర్పవర్తన, సమానత్వంతో కూడిన భగవాన్ మహావీర్ సందేశాలు అద్భుతమైన స్ఫూర్తిని కలిగిస్తాయని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. “మహావీర్ మహోన్నత ఆలోచనలు మానవాళికి ఎల్లప్పుడూ దిశానిర్దేశం చేస్తాయి” అని శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
ప్రధానమంత్రి ఒక సంస్కృత శ్లోకాన్ని పంచుకున్నారు.
‘‘శ్రూయతాం ధర్మసర్వస్వం శ్రుత్వా చైవావధార్యతామ్
ఆత్మనః ప్రతికూలాని పరేషాం న సమాచరేత్’’
సామాజిక మాధ్యమం ‘ఎక్స్‘లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
“సత్యం, సామరస్యం, సత్ర్పవర్తన, సమానత్వంతో కూడిన భగవాన్ మహావీర్ సందేశాలు అత్యంత స్ఫూర్తిదాయం. ఆయన ఉదాత్తమైన ఆలోచనలు మానవాళికి ఎల్లప్పుడూ మార్గనిర్దేశం చేస్తాయి.
శ్రూయతాం ధర్మసర్వస్వం శ్రుత్వా చైవావధార్యతామ్
ఆత్మనః ప్రతికూలాని పరేషాం న సమాచరేత్”
सत्य, सद्भाव, सद्व्यवहार और समानता पर आधारित भगवान महावीर के संदेशों में अद्भुत प्रेरणा है। उनके महान विचार सदैव मानवता के पथ-प्रदर्शक बने रहेंगे।
— Narendra Modi (@narendramodi) March 31, 2026
श्रूयतां धर्मसर्वस्वं श्रुत्वा चैवावधार्यताम्।
आत्मनः प्रतिकूलानि परेषां न समाचरेत्॥ pic.twitter.com/dENpegmiqE