Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

శ్రీ బిజూ పట్నాయక్‌ జయంతి.. నివాళులు అర్పించిన ప్రధానమంత్రి


ఒడిశా మాజీ ముఖ్యమంత్రి శ్రీ బిజూ పట్నాయక్‌ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారు. ఒడిశా ప్రగతిని పెంపొందించడం కోసం శ్రీ బిజూ పట్నాయక్ చాటిన ఉత్సాహాన్ని ప్రధాని స్మరించుకున్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ –
‘‘శ్రీ బిజూ పట్నాయక్ జయంతి ఈ రోజు.. ఈ సందర్భంగా ఆయనకు నేను నివాళులు అర్పించడంతో పాటు, ఒడిశా ప్రగతిని పెంపొందించడానికి శ్రీ బిజూ పట్నాయక్ చాటిన ఉత్సాహాన్ని కూడా స్మరించుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు.