Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని


శాంతి, కరుణ, ఆశతో నిండిన క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలియజేశారు. “యేసు క్రీస్తు బోధనలు మన సమాజంలో సామరస్యాన్ని పెంపొందించాలి” అని ప్రధాని వ్యాఖ్యానించారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధాని ఈ విధంగా పేర్కొన్నారు:

“అందరికీ శాంతి, కరుణ, ఆశతో కూడిన ఆనందదాయకమైన క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. యేసు క్రీస్తు బోధనలు మన సమాజంలో సోదరభావం, సామరస్యాన్ని మరింత బలోపేతం చేయాలని కోరుకుంటున్నాను.”