Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

గోవా విముక్తి దినోత్సవం సందర్బంగా స్వాతంత్య్రయోధుల త్యాగాలను స్మరించుకున్న ప్రధానమంత్రి


గోవా విముక్తి దినోత్సవం భారత జాతీయ ప్రయాణంలో ఓ ముఖ్య అధ్యాయాన్ని గుర్తుకు తీసుకువస్తుందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారుఅన్యాయాన్ని సహించకధైర్యంతోనూ దృఢ సంకల్పంతోనూ స్వాతంత్య్రం కోసం పోరాడిన వారి అజేయ సాహసాన్ని ఆయన స్మరించుకున్నారుగోవా సర్వతోముఖ అభివృద్ధికీదేశానికీ వారు చేసిన త్యాగాలు సదా స్ఫూర్తిని అందిస్తుంటాయని ప్రధానమంత్రి అన్నారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ:

‘‘గోవా విముక్తి దినోత్సవం మన జాతీయ ప్రయాణంలో ఓ ముఖ్య అధ్యాయాన్ని గుర్తు చేస్తుందిఅన్యాయాన్ని సహించక ధైర్యంతోదృఢ సంకల్పంతో స్వాతంత్య్రం కోసం పోరాడిన వారి అజేయ సాహసాన్ని మనం స్మరించుకుంటున్నాంవారి త్యాగాలు.. గోవా సర్వతోముఖ అభివృద్ధి సాధనకు కృషి చేస్తున్న మనకు ఎప్పటికీ స్ఫూర్తిని అందిస్తూనే ఉంటాయి’’ అని పేర్కొన్నారు.

 

***