Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

శాంతి బిల్లుకు పార్లమెంటు ఆమోదం.. ప్రధానమంత్రి హర్షం


శాంతి బిల్లుకు పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదం లభించినందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారుభారత్ సాంకేతిక విజ్ఞాన రంగ రూపురేఖలను మార్చివేసే సందర్భమిది అని ఆయన వ్యాఖ్యానించారు.
బిల్లును సమర్ధించినందుకు పార్లమెంటు సభ్యులకు ప్రధానమంత్రి కృతజ్ఞత‌లు తెలిపారుఈ బిల్లు కృత్రిమ మేధకు సురక్షిత శక్తిని అందిస్తుందనీతయారీ రంగంలో హరిత ప్రధాన ప్రక్రియలను ఆచరించడానికి బాట వేస్తుందనీరాబోయే కాలంలో మన దేశంతో పాటు ప్రపంచంలో స్వచ్ఛ ఇంధనానికి పెద్ద పీట వేయడంలో మహత్తర పాత్రను పోషిస్తుందనీ ప్రధానమంత్రి అన్నారు.
ప్రయివేటు రంగానికీయువతకీ శాంతి బిల్లు అనేక అవకాశాల్ని అందిస్తుందని శ్రీ మోదీ తెలిపారుభారత్‌లో పెట్టుబడి పెట్టడానికీనవకల్పనల మార్గంలో ముందుకు పోవడానికీనిర్మాణాలు చేపట్టడానికీ ఈ కాలం అత్యంత అనుకూల కాలమని కూడా ఆయన అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశంలో ఇలా పేర్కొన్నారు
:
‘‘
శాంతి బిల్లుకు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం తెలపడం మన సాంకేతిక విజ్ఞాన రంగ రూపురేఖలను మార్చివేసే సందర్భందీని ఆమోదానికి మద్దతిచ్చిన ఎంపీలందరికీ నేను కృతజ్ఞత‌లు తెలియజేస్తున్నానుఈ బిల్లు కృత్రిమ మేధకు సురక్షిత శక్తిని అందించడం మొదలు తయారీ రంగంలో హరిత ప్రధాన హరిత ప్రధాన ప్రక్రియల ఆచరణకు మార్గాన్ని సుగమం చేయడం వరకు.. భవిష్యత్తులో ఒక్క మన దేశమే కాకుండాప్రపంచం కూడా స్వచ్ఛ ఇంధనానికి ప్రాధాన్యాన్ని తప్పక ఇచ్చేటట్లుగా గొప్ప ప్రోత్సాహాన్ని ఇస్తుందిప్రయివేటు రంగానికీమన యువతకూ అనేక అవకాశాల్ని కూడా ఈ బిల్లు అందిస్తుందిభారత్‌లో పెట్టుబడి పెట్టేందుకూనవకల్పనల దిశగా ముందుకు పోయేందుకూభారత్‌లో అభివృద్ధి పనులు చేపట్టేందుకూ ఇది అత్యంత అనుకూలమైన సమయం’’.

 

***