Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

డిసెంబర్ 26న ‘వీర్ బాల్ దివస్’ కార్యక్రమంలో పాల్గొననున్న ప్రధానమంత్రి


న్యూఢిల్లీలోని భారత్ మండపంలో రేపు మధ్యాహ్నం 12:15 గంటలకు నిర్వహిస్తున్న వీర్ బాల్ దివస్‘ జాతీయ కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొంటారుఈ సందర్భంగా ప్రధానమంత్రి సభికులనుద్దేశించి ప్రసంగిస్తారు.

వీర్ బాల్ దివస్‌ను పురస్కరించుకుని సాహిబ్‌జాదీల అసాధారణ ధైర్యంఅత్యున్నత త్యాగం గురించి పౌరులకు తెలియజేయడంఅవగాహన కల్పించడంతో పాటు దేశ చరిత్రలోని యువ వీరుల అజేయ ధైర్యంత్యాగంపరాక్రమాన్ని గౌరవించడంస్మరించడం లక్ష్యంగా భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రజల భాగస్వామ్యంతో కార్యక్రమాలను నిర్వహిస్తోందివీరుల గురించిన కథలు చెప్పడంపారాయణాలుపోస్టర్ రూపకల్పనవ్యాస రచన పోటీలు ఈ కార్యక్రమాల్లో భాగంగా ఉంటాయివీటిని పాఠశాలలుపిల్లల సంరక్షణ సంస్థలుఅంగన్‌వాడీ కేంద్రాలుఇతర విద్యా వేదికలతో పాటు ఆన్‌లైన్‌లో మై గవ్, మైభారత్ పోర్టల్స్ వేదికగానూ ఈ కార్యకలాపాలను నిర్వహిస్తారు.

శ్రీ గురు గోవింద్ సింగ్ జీ ప్రకాష్ పురబ్ సందర్భంగా డిసెంబర్ 26వ తేదీని వీర్ బాల్ దివస్గా పాటించనున్నట్లు ప్రధానమంత్రి 2022 జనవరి 9న ప్రకటించారుశ్రీ గురు గోవింద్ సింగ్ జీ కుమారులైన సాహిబ్‌జాదీలు బాబా జోరావర్ సింగ్ జీబాబా ఫతే సింగ్ జీ జ్ఞాపకార్థం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం అమరవీరుల అసమాన త్యాగాన్ని తరతరాలకు తెలియపరుస్తూ… అందరికీ స్ఫూర్తినిస్తూనే ఉంది.

ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ (పీఎంఆర్‌బీపీపురస్కార గ్రహీతలూ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

 

***