పిఎంఇండియా
పాలంలో సంభవించిన ఘోర అగ్నిప్రమాదంపై ప్రధానమంత్రి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.
ఢిల్లీలోని పాలంలో జరిగిన అగ్నిప్రమాదంపై తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ.. ఈ దుర్ఘటనలో ఆత్మీయులను కోల్పోయిన వారికి ప్రధానమంత్రి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. మృతుల కుటుంబాలకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి ఒక్కొక్కరికి రూ. 2 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తామని, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున సహాయం అందిస్తామని ప్రధాని శ్రీ మోదీ ప్రకటించారు.
సామాజిక మాధ్యమం ఎక్స్ లో ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు.
‘‘ఢిల్లీలోని పాలంలో జరిగిన అగ్నిప్రమాద ఘటన కలిచివేస్తోంది. ఈ ప్రమాదంలో తమ ఆత్మీయులను కోల్పోయిన వారికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.
మృతుల కుటుంబాలకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి రూ. 2 లక్షల చొప్పున పరిహారం.. గాయపడిన వారికి రూ. 50,000 అందిస్తున్నాం: ప్రధానమంత్రి’’
***
The fire incident in Palam, Delhi, is saddening. I extend my condolences to those who have lost their loved ones. May the injured recover at the earliest.
— PMO India (@PMOIndia) March 18, 2026
An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of each deceased. The injured would be given Rs.…