పిఎంఇండియా
నవరాత్రుల ఆధ్యాత్మిక వాతావరణానికి సంబంధించిన తన అభిప్రాయాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో ఈ రోజు పంచుకున్నారు. అంబ మాత పట్ల భక్తి ప్రపత్తులు మదిని అనంత శాంతితో, ఉత్సాహంతో నింపేసే తీరును ఆయన ప్రస్తావించారు. అంబ మాతను స్తుతిస్తున్న ఒక భక్తి గీతాన్ని శ్రీ మోదీ ఈ సందర్భంగా పంచుకున్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ:
‘‘నవరాత్రిలో వాతావరణం అంబా మాత పట్ల భక్తితో తడిసిపోయి మనస్సును అనంత శాంతితోనూ, ఉత్సాహంతోనూ నింపేస్తుంది. మాతకు సమర్పితమైన శ్రద్ధ, విశ్వాసాల ప్రతిధ్వనులు హృదయాన్ని స్పందింపచేస్తాయి’’ అని పేర్కొన్నారు.
***