Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మాత కాలరాత్రి ఆశీర్వాదాలను కోరుకుంటూ… సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి


మాత కాలరాత్రి ఆశీర్వాదాలు లభించాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వేడుకున్నారుఆమె కృపతో ప్రతి ఒక్కరి జీవితం సాహసంతోనూసంకల్పంతోనూగెలుపుతోనూ సమృద్ధం కావాలని ఆయన ప్రార్థించారు.

దేవీమాతను ఆరాధించడం వల్ల భక్తుల్లో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుందనీ, ఒక సరికొత్త శక్తి అందరిలో ప్రసరిస్తుందనీ ప్రధాని అన్నారు.

ఒక సంస్కృత కృతిని ప్రజలతో ప్రధానమంత్రి పంచుకున్నారు. ఆ కృతి ఇలా ఉంది.. :

‘‘వామపాదోల్లసల్లోహలతాకణ్టకభూషణా

వర్ధన్మూర్థధ్వజా కృష్ణా కాలరాత్రిర్భయంకరీ’’.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని శ్రీ మోదీ పొందుపరుస్తూ,

‘‘మాత కాలరాత్రికి నమస్సులుదేవి ఆశీస్సులతో అందరి జీవితాలూ సాహసంతోనూసంకల్పంతోనూసాఫల్యంతోనూ సమృద్ధం కావాలని నేను ఆకాంక్షిస్తున్నాను.

‘‘వామపాదోల్లసల్లోహలతాకణ్టకభూషణా

వర్ధన్మూర్థధ్వజా కృష్ణా కాలరాత్రిర్భయంకరీ’’

‘‘దేవీ మాతను ఆరాధించినప్పుడు భక్తుల్లో కొత్త ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతుందిమాత ఉపాసన ప్రతి ఒక్కరిలో ఒక కొత్త శక్తిని నింపుతుంది’’ అని పేర్కొన్నారు.

 

***